Sunday, 14 December 2014

మళ్లీ తెరపైకి మోడీ ప్రభుత్వ మతతత్వ అజెండా..

కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆరెస్సెస్‌, దాని అనుబంధ   సంస్థల రూపంలో మతతత్వ అజెండాను ఉధృతం చేస్తోంది . లవ్‌ జిహాద్‌, సాధ్వి వ్యాఖ్యలు, చరిత్ర పుస్తకాల్లో మార్పులు, భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలనడం, బలవంతపు మత మార్పిడులు, గాంధీని చంపిన గాడ్సేను పొగడడం ఇలా రకరకాల రూపాల్లో ఆరెస్సెస్‌, బిజెపిలు తమ ఫాసిస్టు అజెండాను ముందుకు తెస్తూన్నాయి.. ముస్లింలు, క్రైస్తవుల్లో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో మతానికి ఒక్కో రేటు నిర్ణయిస్తూ దానిని పక్కాగా అమలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్‌లో ముస్లింలతోబాటు క్త్రెస్తవులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా మత మార్పిడి గావించడానికి సంఫ్‌ు శక్తులు వేసిన పథకం ఆధారాలతో సహా మీడియాకు లభ్యమైంది. గతంలో హిందువులు ఎక్కడైనా స్వచ్ఛందంగా ఇతర మతాల్లోకి మారితే వాటిని బలవంతపు మత మార్పిడులంటూ నానా యాగీ చేసిన ఆరెస్సెస్‌, బిజెపిలు ఇప్పుడు తామే ఆ పనికి తెగబడడం వాటి ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోంది.

No comments:

Post a Comment