Saturday 27 June 2015

చాప కింద నీరులా నియంతృత్వం..


పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్‌. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది.
బడా పెట్టుబడి రాజకీయ వ్యవస్థను ఆక్రమించింది. బడా పెట్టుబడి అందించే డబ్బు సంచులకు బూర్జువా రాజకీయ పార్టీలన్నీ దాసోహమంటున్నాయి. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేస్తున్నది. పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్‌. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది. నయా ఉదారవాద మార్కెట్‌ మౌఢ్యం, హిందూత్వల ఈ కలబోత నియంతృత్వాన్ని ప్రమాదకరంగా వండివార్చేవిగా ఉన్నాయి. ఒకవైపు శ్రామిక చట్టాలను మార్చి కార్మిక సంఘాలను బలహీనపరుస్తూ, మరోవైపు భూ సేకరణ చట్టంలో తెస్తున్న మార్పులవలె పార్లమెంటు ప్రమేయంలేకుండా ఆర్డినెన్స్‌లను జారీచేస్తూ ప్రభుత్వం మార్కెట్‌ అనుకూల చట్టాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. బిజెపికి స్వంతంత్రంగా మెజారిటీ ఉండటంతో పార్లమెంటును మోడీ ప్రభుత్వం చులకన భావంతో చూస్తున్నది. అది రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది. నయా ఉదారవాదంలో ప్రజాస్వామ్యం పరిమితమవటానికి, ప్రజలెన్నుకున్న సంస్థల పరిధిలో నుంచి ప్రధాన నిర్ణయాధికారాలను లాక్కునేందుకు నడుస్తున్న ప్రక్రియలో ఆర్డినెన్స్‌ల వెల్లువ, రాజ్యసభను కించపరిచే ప్రయత్నం, ప్రధాని చేతుల్లో అన్ని అధికారాలూ కేంద్రీకృతమవ్వటం వంటి విషయాలు భాగమే. కాబట్టి, ఒక నియంతృత్వ క్రమం చాపకింద నీరులా చేరుకునే పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. నయా ఉదార వాదం, హిందూత్వ మతతత్వం, నియంతృత్వం-ఈ మూడింటి పైనా బహుముఖ పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇవన్నీ మౌలికంగా జతయివున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం నాటి అత్యవసర పరిస్థితి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఈ వర్తమాన పోరాటంలో మనకు ఉపయోగపడతాయి.
- ప్రకాశ్‌ కరత్‌

Friday 19 June 2015

బడి నవ్వుతోంది..!

కార్పొరేట్‌, ప్రయివేటు కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ జీవో నెం.1(94) ప్రకారం యాజమాన్య కమిటీలు నియమించాలి. అధిక ఫీజుల తగ్గింపు, విద్యా ప్రమాణాల పెంపుదల, కనీస సౌకర్యాలు ఏర్పాటు విషయం ఆ కమిటీల్లో చర్చించి నిర్ణయాలు చేయాలి. ప్రజా ప్రతినిధులు తలో ఒక ప్రభుత్వ పాఠశాలను స్మార్ట్‌ స్కూల్‌గా చేయటానికి దత్తత తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్‌, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలనూ, ఐటిఐలనూ నేటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాలలో గురుకుల పాఠశాలలు ప్రారంభించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలను ఒక కిలోమీటరు పరిధిలో ఏ స్కూలుఉందో దానిలో చేర్పించుకోవాలి. ఏదో ఒక బడిలో చేర్చాలి. కార్పొరేట్‌ స్కూళ్లు, కళాశాలల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేకించాల్సిన 25 శాతం సీట్లను కేటాయించి వారి ఫీజులను ప్రభుత్వమే చెల్లించేలా ప్రొసీజర్లు ఖరారు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమానికి సార్థకత ఏర్పడుతుంది.
               బడి గంటలు గణగణమన్నాయి. అంతటా విద్యా కోలాహలం ప్రారంభమైంది. కానీ.. వాటి చుట్టూ ముసురుకున్న సమస్యలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమం తీరుతెన్నులు చూసి బడి పగలబడి నవ్వుతోంది. ఇంకా అనేకచోట్ల శిథిల పాఠశాలలు, ఫర్నీచర్‌లేని తరగతి గదులు, పైకప్పుల్లేని మరుగుదొడ్లు, గోడలు పడిపోయిన మూత్రశాలలు, తాగునీటి కొరత, భర్తీకాని ఉపాధ్యాయుల ఖాళీలు, పుస్తకాలందని పిల్లలను చూస్తుంటే 'బడి పిలుస్తోందా!' లేక ఈ దుస్థితి చూసి 'బడి నవ్వుతోందా!' అని సందేహం కలగక మానదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకూ 'బడి పిలుస్తోంది' అనే కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇటీవలనే ముఖ్యమంత్రి దానిపై విద్య, వైద్య, మున్సిపల్‌, తదితర శాఖల మంత్రులను కూర్చోబెట్టుకొని సమీక్ష చేసి 15 నుంచి బ్రహ్మాండంగా పాఠశాలలను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. ఇంకా పాఠశాలల్లో పదివేల పోస్టులను భర్తీ చేయవలసే ఉంది. డిఎస్‌సి సెలక్షన్స్‌ అయ్యాయి. నియామకాలకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డొచ్చిందని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎదురవుతుందని నాలుగు నెలల ముందటే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. టీచర్ల నియామకాలు జరగక ముందే పాఠశాలలు మొదలయ్యాయి. అప్పటికే ప్రయివేటు విద్యాసంస్థలు ఇల్లిల్లూ తిరిగి పిల్లల్ని చేర్పించుకున్నాయి. ఆ తరువాత 'బడి పిలుస్తోంది' అంటే ఎవరొస్తారు?
- వి కృష్ణయ్య