Saturday 27 June 2015

చాప కింద నీరులా నియంతృత్వం..


పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్‌. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది.
బడా పెట్టుబడి రాజకీయ వ్యవస్థను ఆక్రమించింది. బడా పెట్టుబడి అందించే డబ్బు సంచులకు బూర్జువా రాజకీయ పార్టీలన్నీ దాసోహమంటున్నాయి. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేస్తున్నది. పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్‌. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది. నయా ఉదారవాద మార్కెట్‌ మౌఢ్యం, హిందూత్వల ఈ కలబోత నియంతృత్వాన్ని ప్రమాదకరంగా వండివార్చేవిగా ఉన్నాయి. ఒకవైపు శ్రామిక చట్టాలను మార్చి కార్మిక సంఘాలను బలహీనపరుస్తూ, మరోవైపు భూ సేకరణ చట్టంలో తెస్తున్న మార్పులవలె పార్లమెంటు ప్రమేయంలేకుండా ఆర్డినెన్స్‌లను జారీచేస్తూ ప్రభుత్వం మార్కెట్‌ అనుకూల చట్టాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. బిజెపికి స్వంతంత్రంగా మెజారిటీ ఉండటంతో పార్లమెంటును మోడీ ప్రభుత్వం చులకన భావంతో చూస్తున్నది. అది రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది. నయా ఉదారవాదంలో ప్రజాస్వామ్యం పరిమితమవటానికి, ప్రజలెన్నుకున్న సంస్థల పరిధిలో నుంచి ప్రధాన నిర్ణయాధికారాలను లాక్కునేందుకు నడుస్తున్న ప్రక్రియలో ఆర్డినెన్స్‌ల వెల్లువ, రాజ్యసభను కించపరిచే ప్రయత్నం, ప్రధాని చేతుల్లో అన్ని అధికారాలూ కేంద్రీకృతమవ్వటం వంటి విషయాలు భాగమే. కాబట్టి, ఒక నియంతృత్వ క్రమం చాపకింద నీరులా చేరుకునే పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. నయా ఉదార వాదం, హిందూత్వ మతతత్వం, నియంతృత్వం-ఈ మూడింటి పైనా బహుముఖ పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇవన్నీ మౌలికంగా జతయివున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం నాటి అత్యవసర పరిస్థితి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఈ వర్తమాన పోరాటంలో మనకు ఉపయోగపడతాయి.
- ప్రకాశ్‌ కరత్‌

No comments:

Post a Comment