కార్పొరేట్, ప్రయివేటు కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ జీవో నెం.1(94) ప్రకారం యాజమాన్య కమిటీలు నియమించాలి. అధిక ఫీజుల తగ్గింపు, విద్యా ప్రమాణాల పెంపుదల, కనీస సౌకర్యాలు ఏర్పాటు విషయం ఆ కమిటీల్లో చర్చించి నిర్ణయాలు చేయాలి. ప్రజా ప్రతినిధులు తలో ఒక ప్రభుత్వ పాఠశాలను స్మార్ట్ స్కూల్గా చేయటానికి దత్తత తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలనూ, ఐటిఐలనూ నేటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాలలో గురుకుల పాఠశాలలు ప్రారంభించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలను ఒక కిలోమీటరు పరిధిలో ఏ స్కూలుఉందో దానిలో చేర్పించుకోవాలి. ఏదో ఒక బడిలో చేర్చాలి. కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేకించాల్సిన 25 శాతం సీట్లను కేటాయించి వారి ఫీజులను ప్రభుత్వమే చెల్లించేలా ప్రొసీజర్లు ఖరారు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమానికి సార్థకత ఏర్పడుతుంది.
బడి గంటలు గణగణమన్నాయి. అంతటా విద్యా కోలాహలం ప్రారంభమైంది. కానీ.. వాటి చుట్టూ ముసురుకున్న సమస్యలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమం తీరుతెన్నులు చూసి బడి పగలబడి నవ్వుతోంది. ఇంకా అనేకచోట్ల శిథిల పాఠశాలలు, ఫర్నీచర్లేని తరగతి గదులు, పైకప్పుల్లేని మరుగుదొడ్లు, గోడలు పడిపోయిన మూత్రశాలలు, తాగునీటి కొరత, భర్తీకాని ఉపాధ్యాయుల ఖాళీలు, పుస్తకాలందని పిల్లలను చూస్తుంటే 'బడి పిలుస్తోందా!' లేక ఈ దుస్థితి చూసి 'బడి నవ్వుతోందా!' అని సందేహం కలగక మానదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకూ 'బడి పిలుస్తోంది' అనే కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇటీవలనే ముఖ్యమంత్రి దానిపై విద్య, వైద్య, మున్సిపల్, తదితర శాఖల మంత్రులను కూర్చోబెట్టుకొని సమీక్ష చేసి 15 నుంచి బ్రహ్మాండంగా పాఠశాలలను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. ఇంకా పాఠశాలల్లో పదివేల పోస్టులను భర్తీ చేయవలసే ఉంది. డిఎస్సి సెలక్షన్స్ అయ్యాయి. నియామకాలకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డొచ్చిందని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎదురవుతుందని నాలుగు నెలల ముందటే పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. టీచర్ల నియామకాలు జరగక ముందే పాఠశాలలు మొదలయ్యాయి. అప్పటికే ప్రయివేటు విద్యాసంస్థలు ఇల్లిల్లూ తిరిగి పిల్లల్ని చేర్పించుకున్నాయి. ఆ తరువాత 'బడి పిలుస్తోంది' అంటే ఎవరొస్తారు?
- వి కృష్ణయ్య
బడి గంటలు గణగణమన్నాయి. అంతటా విద్యా కోలాహలం ప్రారంభమైంది. కానీ.. వాటి చుట్టూ ముసురుకున్న సమస్యలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమం తీరుతెన్నులు చూసి బడి పగలబడి నవ్వుతోంది. ఇంకా అనేకచోట్ల శిథిల పాఠశాలలు, ఫర్నీచర్లేని తరగతి గదులు, పైకప్పుల్లేని మరుగుదొడ్లు, గోడలు పడిపోయిన మూత్రశాలలు, తాగునీటి కొరత, భర్తీకాని ఉపాధ్యాయుల ఖాళీలు, పుస్తకాలందని పిల్లలను చూస్తుంటే 'బడి పిలుస్తోందా!' లేక ఈ దుస్థితి చూసి 'బడి నవ్వుతోందా!' అని సందేహం కలగక మానదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకూ 'బడి పిలుస్తోంది' అనే కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇటీవలనే ముఖ్యమంత్రి దానిపై విద్య, వైద్య, మున్సిపల్, తదితర శాఖల మంత్రులను కూర్చోబెట్టుకొని సమీక్ష చేసి 15 నుంచి బ్రహ్మాండంగా పాఠశాలలను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. ఇంకా పాఠశాలల్లో పదివేల పోస్టులను భర్తీ చేయవలసే ఉంది. డిఎస్సి సెలక్షన్స్ అయ్యాయి. నియామకాలకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డొచ్చిందని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎదురవుతుందని నాలుగు నెలల ముందటే పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. టీచర్ల నియామకాలు జరగక ముందే పాఠశాలలు మొదలయ్యాయి. అప్పటికే ప్రయివేటు విద్యాసంస్థలు ఇల్లిల్లూ తిరిగి పిల్లల్ని చేర్పించుకున్నాయి. ఆ తరువాత 'బడి పిలుస్తోంది' అంటే ఎవరొస్తారు?
- వి కృష్ణయ్య
No comments:
Post a Comment