Monday 8 December 2014

మోడీ హయంలో ప్రణాళికాసంఘం ఉనికి ప్రస్నార్ధకం ..

ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ అనే రంధిలో పడిపోయి ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళిక అవసరాన్నే మరచిపోయి, ప్రణాళికాసంఘం ఉనికినే ప్రశ్నిస్తున్నారు. ప్రణాళికాసంఘాన్ని రద్దు చేస్తున్నట్టు నాలుగు నెలల క్రితం ఏకపక్షంగా, ఏమాత్రం ముందస్తు ఆలోచన లేకుండా ప్రకటించారు.అసలు ప్రణాళికాబద్ధమైన ఆలోచనలకు, చర్యలకు ఆయన వ్యతిరేకి అనడానికి ఇదే సాక్ష్యం. జాతీయ వనరులను ప్రైవేటుకు కట్టబెట్టే తొందరే ప్రణాళికా సంఘంపై ఆయన కత్తికట్టడం వెనుక అసలు రహస్యం. అదానీ గ్రూపుతో తన ఆత్మీయబంధంపై విమర్శలు వెల్లువెత్తు తున్నా, ఆ గ్రూపునకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి వేల కోట్ల రూపాయల రుణసాయానికి ప్రతిపాదన రావడం ఆయన ఎంత 'తొందరలో' ఉన్నారో చెప్పకనే చెప్పింది. 'ప్రభుత్వం వెలుపల, అంటే ప్రైవేట్‌ రంగంలో జరుగుతున్న వాటితో సహా దేశంలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాలను ఒకే ఛత్రం కిందికి తెచ్చే విధంగా ఒక సరికొత్త ప్రణాళికా యంత్రాంగాన్ని మనం అభివృద్ధి చేయగలమా?' అని ప్రశ్నించడంలోనే ఆయన ఆంతర్యం సుస్పష్టం.
అభివృద్ధిని సాధించడమే కాకుండా, అభివృద్ధి ఫలాలు తాడిత, పీడిత, వెనుకబడిన వర్గాలకు సైతం సమానంగా, సక్రమం గా అందేలా చూడాలన్న ఆశయంతో ప్రణాళికాసంఘం అవతరించింది. రాజ్యాంగ నిర్దేశిత ఆశలు, ఆకాంక్షలే దానికి స్ఫూర్తి. గత ఆరున్నర దశాబ్దాలలో ఎక్కువ కాలం దేశాన్ని శాసించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యం చేసిన మాట నిజం.అభివృద్ధిని సాధించడమే కాకుండా, అభివృద్ధి ఫలాలు తాడిత, పీడిత, వెనుకబడిన వర్గాలకు సైతం సమానంగా, సక్రమం గా అందేలా చూడాలన్న ఆశయంతో ప్రణాళికాసంఘం అవతరించింది. రాజ్యాంగ నిర్దేశిత ఆశలు, ఆకాంక్షలే దానికి స్ఫూర్తి. గత ఆరున్నర దశాబ్దాలలో ఎక్కువ కాలం దేశాన్ని శాసించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యం చేసిన మాట నిజం. 

No comments:

Post a Comment