Sunday 11 January 2015

సిపిఎం జాతీయ మహాసభల పైలాన్‌..

ఏప్రిల్‌ 14 నుంచి 19 తేదీల్లో విశాఖ నగరం లో జరగనున్న సిపిఎం 21వ అఖిల భారత మహా సభలకు సూచికగా విశాఖనగరంలోని డాబాగార్డెన్స్‌ అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద సుమారు 50 అడుగుల ఎత్తున ఏర్పాటైన పైలాన్‌పై ఒక వైపున మార్క్స్‌, ఏంగిల్స్‌, లెనిన్‌, స్టాలిన్‌, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌, చేగువేరా ఫొటోలను ఏర్పాటు చేశారు. మరోవైపున సిపిఎం అగ్రనేతలు కీర్తిశేషులు ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, జ్యోతిబసు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎకె గోపాలన్‌, పి.రామ్మూర్తి, ప్రమోద్‌దాస్‌ గుప్తా, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, బిటి రణదేవ్‌, మాకినేని బసవపున్నయ్య ఫొటోలను ఏర్పాటు చేశారు. 'ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ నిలిపివేయాలి, కార్మిక చట్టాలపై ప్రభుత్వ దాడిని విడనాడాలి, నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించాలి, ప్రభుత్వ విద్య, వైద్యాన్ని బలోపేతం చేయాలి' వంటి నినాదాలు పైలాన్‌పై ఉన్నాయి. ఈ ఫైలాన్‌ చూపరులను ఆకట్టుకుంటోంది.

No comments:

Post a Comment