Friday 13 February 2015

దామాషా ఎన్నిక .. ఎస్.వెంకట్రావ్

ప్రస్తుత ఎన్నికల విధానం మన దేశంలో ఎన్నికలను వ్యాపారంగా మార్చేసింది.ప్రధాన పార్టీ అభ్యర్ధులకే గెలిచే అవకాశాలు ఎక్కువ కనుక ఎన్నికల్లో సీట్లు సంపాదించడానికి అభ్యర్ధులు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు.ప్రధాన బూర్జువా పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో బాగా ఖర్చు చేయగలిగిన వారికే సీట్లు ఇస్తున్నాయి.పోటీ చేసే అభ్యర్ధులు కూడా గెలుపు కోసం ఓట్లను డబ్బిచ్చి కొనేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.దామాషా ఎన్నికల(ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్)విధానంలో అయితే ఒక పార్టీకి దేశం మొత్తం మీద,లేక ఒక ప్రాంతంలో ఎంత శాతం ఓట్లు వస్తే చట్టసభల్లో దానికి అంత శాతం ప్రాధాన్యత లభిస్తుంది. అంటే ఓట్ల శాతాన్ని బట్టి అభ్యర్ధుల శాతం ఉంటుందన్నమాట.దీని వాల్ల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష చాల వరకు చట్ట సభల్లో ప్రతిబింబిస్తుంది.చిన్నచిన్న సామజిక తరగతులకు కూడా తగిన ప్రాధాన్యత లభించే అవకాశం వుంటుంది. అయితే దామాషా ఎన్నికల విధానం కూడా పూర్తి ప్రజాస్వామికం అనుకోకూడదు.ఇవన్నికూడా బూర్జువ ప్రజాస్వామ్యం లో కొన్ని ఎన్నికల వ్యవస్థలు.ప్రజాస్వామ్యం ఒక్క సోషలిస్ట్ వ్యవస్థలోనే పూర్తిగా ప్రజ్వరిల్లుతుంది.ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో పరిమితులను అధిగమించేందుకు,మెరుగైన వ్యవస్థలు రూపొందించుకునేందుకూ కేవలం పోరాడడం ద్వారానే మనం జనతా ప్రజాస్వామ్యం లోకి వెళ్ళగలం.

No comments:

Post a Comment