Monday 29 December 2014

కార్మిక చట్టాల్లో మార్పు ప్రతిపాదనలు...చట్ట సవరణ ప్రభావం


వాస్తవానికి కార్మికవర్గం చట్టాలను పురోగమన దిశగా మార్చాలని కోరుకుంటున్నది .కాని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను తిరోగమన దిశకు మార్చడానికి పూనుకుంటోంది . దీని ప్రభావం చాల తీవ్రంగా వుంటుంది . కార్మికుల తొలగింపు,కంపెనీలు లోకౌట్ ,లే ఆఫ్ ,మూసివేతలకు ప్రభుత్వ అనుమతులు,వేతన ఒప్పందాలు  తదితర ముక్య అంశాలకు సంభందించిన కార్మిక వివాదాల చట్టం 1947 ను 300 మంది లోపు వున్న పరిశ్రమలకు వర్తించకుండా చట్టని మారిస్తే దేశంలో 80 శాతం కార్మికులకు చట్టమే వర్తించకుండా పోతుంది .కాంట్రాక్టు కార్మిక చట్టాన్ని ఇప్పుడున్న ఒక కాంట్రాక్టర్ వద్ద 20 మందికి వర్తించే బదులు 49 మంది వరకు వర్తించితే 80 శాతం అమంది చట్ట పరిధి నుంచి బయటకు పోతారు . ఫ్యాక్టరీ చట్టం 50 అమంది మత్త్రమే వున్న పరిశ్రమలకు అమలు చేస్తే 71.3శాతం పరిశ్రమలకు వర్తించకుండా పోతుంది. ఇప్పుడునన్ చట్టాల్లో అనేక లొసుగులు వున్నాయి . హత్య చేసిన నేరస్తుడుకుడా నేరుగా కోర్ట్ కి వెళ్ళచ్చు . కానీ కార్మికుడు నేరుగా కోర్ట్ కి వెళ్ళే విధంగా కార్మిక చట్టాలు లేవు . లేబర్ ఆఫీసర్ వద్ద విచారణ జరిగి కన్విఎషన్ విచారణలో అధికారులు అనుమతి ఇస్తేనే కార్మికుల తొలగింపు న్యాయమా ?అన్యాయమా? అని కార్మిక కోర్ట్ విచారిస్తుంది . బోనస్ ,గ్రాట్యుటి చట్టంలో సీలింగ్ విధించారు . పెన్షన్ చట్టాలు మార్పు చేసి వచ్చే పెన్షన్ ను రాకుండా చేసారు . నష్టపరిహార చట్టం ప్రకారం కార్మికునికి నెల జీతం 10 వేలు దాటితే చట్టం వర్తించదు. సీలింగుల పేరుతొ అనేక చట్టం అమలుకాకుండా చట్టాలు చేసినపుడే యజమానులకు లాభించేల నేటికి చట్టాలు వున్నాయి . 

No comments:

Post a Comment